అటవీ శాఖ కార్యాలయం ముట్టడి
ABN, First Publish Date - 2021-03-17T20:13:09+05:30
అటవీ అధికారులు ఆక్రమించిన భూములు తిరిగి తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అటవీ శాఖ
నిజామాబాద్: అటవీ అధికారులు ఆక్రమించిన భూములు తిరిగి తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అటవీ శాఖ కార్యాలయాన్ని కల్లెడ గ్రామస్తులు ముట్టడించారు. తమ భూములను ఫారెస్ట్ అధికారులు అక్రమంగా లాక్కుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిజామాబాద్, బాన్స్వాడ రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు. రహదారిపై వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. అటవీ అధికారులు ఆక్రమించిన తమ భూములను తిరిగి తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2021-03-17T20:13:09+05:30 IST