Mahabubabad: అటవీ, విద్యుత్ శాఖ అధికారుల మధ్య కోల్డ్వార్
ABN, First Publish Date - 2021-08-10T13:31:40+05:30
కొత్తగూడలో అటవీ, విద్యుత్ శాఖ అధికారుల మధ్య కోల్డ్వార్ చోటు చేసుకుంది. కరెంట్ తీగలకు ఆనుకున్న చెట్ల కొమ్మలను విద్యుత్ అధికారులు తొలగించారు. దీంతో అటవీశాఖ కార్యాలయం
మహబూబాబాద్: కొత్తగూడలో అటవీ, విద్యుత్ శాఖ అధికారుల మధ్య కోల్డ్వార్ చోటు చేసుకుంది. కరెంట్ తీగలకు ఆనుకున్న చెట్ల కొమ్మలను విద్యుత్ అధికారులు తొలగించారు. దీంతో అటవీశాఖ కార్యాలయం, క్వార్టర్స్కు కరెంట్ నిలిచిపోయింది. రాత్రంతా చీకట్లోనే అటవీ అధికారులు గడిపారు. దీంతో అటవీ, విద్యుత్ శాఖ అధికారుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. సమాచారం ఇవ్వకుండా ఎలా విద్యుత్ నిలిపివేశారంటూ విద్యుత్శాఖ అధికారులపై అటవీ అధికారులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ నిలిపివేసిన వారిపై 1174, 1175 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Updated Date - 2021-08-10T13:31:40+05:30 IST