పొలానికి నీరివ్వలేదని ప్రాణం తీశారు!
ABN, First Publish Date - 2021-01-26T09:01:14+05:30
భూ తగాదాల నేపథ్యంలో పొలానికి నీరివ్వలేదన్న కారణంతో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తూటి
యాదాద్రి జిల్లాలో రైతు హత్య
తుర్కపల్లి, జనవరి 25: భూ తగాదాల నేపథ్యంలో పొలానికి నీరివ్వలేదన్న కారణంతో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తూటి రాంచంద్రయ్య(54)కు పక్క పొలానికి చెందిన ఇబ్రహీంతో ఐదేళ్లుగా భూ తగాదాలున్నాయి. ఆదివారం ఉదయం బోరుబావి నుంచి తమ పొలానికి నీరివ్వాలని ఇబ్రహీం, అతని కుమారులు రాంచంద్రయ్యను అడగ్గా నిరాకరించాడు. దీన్ని మనసులో పెట్టుకొని రాంచంద్రయ్యను కర్రతో కొట్టి చంపారని.. అతడి సోదరులు బాల్నర్సయ్య, సంజీవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇబ్రహీంను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.
Updated Date - 2021-01-26T09:01:14+05:30 IST