టీఆర్ఎస్ నేత నుంచి ప్రాణ భయం ఉందంటూ మాజీ సర్పంచ్ నిరసన
ABN, First Publish Date - 2021-10-06T23:17:16+05:30
టీఆర్ఎస్ నేత నుంచి ప్రాణ భయం ఉందంటూ మాజీ సర్పంచ్ నిరసన
సిద్దిపేట: తనకు ప్రాణ భయం ఉందంటూ మాజీ సర్పంచ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. హుస్నాబాద్ మండలం గాంధీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోతి రామచంద్రం అదే గ్రామానికి చెందిన కొడముంజి రమేశ్ కుటుంబంతో ప్రాణభయం ఉందంటూ పలకపై రాసి ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకుడు కొడముంజి రమేశ్ కుటుంబ సభ్యులు తన కుటంబంపై లేనిపోని కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోతి రామచంద్రం ఆరోపించారు. రమేశ్ ప్రోద్బలంతో కుల పెద్దలు తనను, తన కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి పండగలు, పబ్చాలకు రానివ్వకుండా మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను స్టేషన్కు తరలించారు.
Updated Date - 2021-10-06T23:17:16+05:30 IST