బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మొదటిసారి ఈటల
ABN, First Publish Date - 2021-06-21T15:31:32+05:30
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత మెదటిసారి ఆయన
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత మెదటిసారి ఆయన బీజేపీ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. నేటి ఉదయం 10.30 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఈటలకు బండి సంజయ్, తరుణ్ చుగ్ తదితరులు ఘన స్వాగతం పలకనున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల నేరుగా హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు. ఈటల రాక నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద భారీగా అభిమానులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
Updated Date - 2021-06-21T15:31:32+05:30 IST