బండి సంజయ్ అలా చేస్తే కాళ్లు మొక్కుతాం: ఎర్రబెల్లి
ABN, First Publish Date - 2021-10-29T01:21:16+05:30
ఎఫ్ఐసీ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని బండి సంజయ్ కేంద్రం నుంచి లేఖ తెస్తే ప్రజల తరఫున ఆయన కాళ్లు మొక్కుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
హనుమకొండ: ఎఫ్ఐసీ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని బండి సంజయ్ కేంద్రం నుంచి లేఖ తెస్తే ప్రజల తరఫున ఆయన కాళ్లు మొక్కుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రైతులను కార్లు ఎక్కించి తొక్కించిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదని, రైతులను కార్లలో తిరిగేలా చేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమన్నారు. ఎంత నష్టం జరిగినా దాన్యం కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కేంద్రం చేతులెత్తేస్తే బండి సంజయ్ సిగ్గు లేకుండా దీక్షలు చేపట్టారని విమర్శించారు. రైతులను గందరగోళం చేయాలనుకుంటే బండి సంజయ్ కూడా గందరగోళంలో చిక్కుకుంటాడని హెచ్చరించారు.
Updated Date - 2021-10-29T01:21:16+05:30 IST