కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ
ABN, First Publish Date - 2021-12-19T22:35:19+05:30
కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కల్వకుర్తి ఎత్తిపోతల విషయంలో 2 అంశాలను ఒకటిగా పొందుపరచాలన్నారు.
హైదరాబాద్: కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కల్వకుర్తి ఎత్తిపోతల విషయంలో 2 అంశాలను ఒకటిగా పొందుపరచాలన్నారు. గెజిట్లో 25 నుంచి 40 టీఎంసీలు పెంచినట్లు చూపడం తప్పు అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయకట్టు పెంచినా.. నీటి కేటాయింపులు పెంచలేదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆయకట్టును పెంచలేదన్నారు. ఆయకట్టు పెంచుతూ ఏపీ జారీ చేసిన జీవోలు లేఖకు ఆధికారులు జతచేశారని పేర్కొన్నారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తీసుకునేలా డీపీఆర్ల ఉందన్నారు. ఏపీలోని జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, టీజీపీ రిపోర్టులు ట్రైబ్యునల్కు ఇచ్చామన్నారు.
Updated Date - 2021-12-19T22:35:19+05:30 IST