సీఎం కేసీఆర్కు ఈటల లేఖ! వైరల్గా మారిన వైనం
ABN, First Publish Date - 2021-06-26T00:16:54+05:30
సీఎం కేసీఆర్కు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రాసినట్టుగా చెబుతోన్న లేఖ సోషల్
కరీంనగర్: సీఎం కేసీఆర్కు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రాసినట్టుగా చెబుతోన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "అన్నా క్షమించు" అంటూ కేసీఆర్కు ఈటల లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రిగా ఈటల ఉన్నప్పడు రాసిన లేఖగా పోస్టింగ్ అయింది. కొందరి వల్ల తప్పులు చేశా, మీటింగులు పెట్టా అంటూ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తనను వేలు పట్టి నడిపించారని లేఖలో రాశారు. అందరినీ కాదని తనకు ప్రాధాన్యత ఇచ్చారంటూ లేఖ రాశారు. కానీ కొందరి తప్పుడు మాటల వల్ల తప్పుదారి పట్టానని ఆ లేఖలో పేర్కొన్నారు.
బెంగుళూరు, పూణే ల్లో సమావేశాలు నిర్వహించానని ఆయన తెలిపారు. ఇక మీదట తప్పుడు పనులు చేయనని, తమ్ముడిలా భావించి పెద్ద మనసుతో క్షమించండి అంటూ ఈటల రాసినట్టుగా చెబుతున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే ఈ లేఖ నకిలీదంటూ ఈటల సిబ్బంది పేర్కొంటున్నారు. దీనిపై డీఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్న ఈటల పీఏలు తెలిపారు.
Updated Date - 2021-06-26T00:16:54+05:30 IST