ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టు 24, 25న ఎడ్‌సెట్‌

ABN, First Publish Date - 2021-04-17T07:15:31+05:30

రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 19 నుంచి దరఖాస్తులు
  • నోటిఫికేషన్‌ విడుదల
  • పరీక్షా విధానంలో మార్పులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19 నుంచి జూన్‌ 15 వరకు కొనసాగుతుంది. రూ.1,000 ఆలస్య రుసుముతో జూలై 20 వరకు సమర్పించవచ్చు. దరఖాస్తు రుసుం రూ.650గా నిర్ణయించారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో  ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్‌ ఉంటుంది. ఈసారి ఎడ్‌సెట్‌ పరీక్ష విధానాన్ని మార్చారు. ఇంతవరకు వివిధ సబ్జెక్టుల వారీగా ర్యాంకులు కేటాయిస్తుండగా.. ఇకనుంచి అన్నింటికీ కలిపి ర్యాంకులు కేటాయించనున్నారు. 150 మార్కుల ప్రశ్నప్రతం ఆబ్జెక్టివ్‌ టైప్‌ (మల్టిపుల్‌ ఛాయిస్‌) విధానంలో ఉంటుంది. వీటిని రెండు గంటల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, సోషల్‌, టీచింగ్‌ అప్టిట్యూట్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టులకు 20మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌, ఎడ్యుకేషనల్‌ ఇష్యూ్‌సకి 30 మార్కులు ఉంటాయి. 

Updated Date - 2021-04-17T07:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising