ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలరాంనాయక్‌పై ఈసీ అనర్హత వేటు

ABN, First Publish Date - 2021-06-24T09:23:36+05:30

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై... భారత ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వేసింది. 2019 ఎన్నికలలో మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాం ఓటమి పాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మూడేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం
  • ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకే..


హైదరాబాద్‌, జూన్‌  23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై... భారత ఎన్నికల కమిషన్‌  అనర్హత వేటు వేసింది. 2019 ఎన్నికలలో మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాం ఓటమి పాలయ్యారు. కానీ, నిర్ణీత గడువులోగా ఆయన ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించకపోవడంతో తాజాగా ఈసీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు మూడేళ్లపాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అర్హతను ఆయన కోల్పోయారు. అలాగే, అదే నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావుతోపాటు మరో నలుగురిపైనా అనర్హత వేటు వేస్తూ భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) ఆదేశానుసారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) శశాంక్‌గోయల్‌ ఇటీవల నోటిఫికేషన్‌  జారీ చేశారు. ఇదిలా ఉండగా, 2019లో మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన తాను.. ఖర్చుల వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించానని బలరాం నాయక్‌ స్పష్టం చేశారు. ఈ వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్‌కు మళ్లీ సమర్పిస్తానని, అవసరమైతే కోర్టు ద్వారా అందజేస్తానని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-24T09:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising