ధాన్యం కొనుగోళ్లపై 9న ధర్మాగ్రహ దీక్ష
ABN, First Publish Date - 2021-12-04T08:43:00+05:30
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని, బియ్యం సేకరణను గతంలో మాదిరిగానే కొనసాగించాలన్న డిమాండ్తో హైదరాబాద్లో ఈ నెల 9న ధర్మాగ్రహ దీక్ష చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి.
హైదరాబాద్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని, బియ్యం సేకరణను గతంలో మాదిరిగానే కొనసాగించాలన్న డిమాండ్తో హైదరాబాద్లో ఈ నెల 9న ధర్మాగ్రహ దీక్ష చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి. 7న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దీక్షలు, లేదా సమీపంలో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్రెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2021-12-04T08:43:00+05:30 IST