కాళేశ్వరంలో భక్తుల సందడి
ABN, First Publish Date - 2021-01-25T04:58:48+05:30
కాళేశ్వరంలో భక్తుల సందడి
మహదేవపూర్, జనవరి 24: మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ఆది వారం సందడి నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో కాళేశ్వరం చేరుకొని గోదావరిలో స్నానాలు ఆచరించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్జిత సేవా టికెట్లు, ప్రసాదాల విక్రయాలతో ఆలయానికి రూ.2లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
Updated Date - 2021-01-25T04:58:48+05:30 IST