దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారకంగా మలుస్తాం: పవన్
ABN, First Publish Date - 2021-10-17T21:55:26+05:30
మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారకంగా మలుస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రకటించారు.
హైదరాబాద్: మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారకంగా మలుస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోటి రూపాయల నిధిని ఏర్పాటుచేస్తామని తెలిపారు. నిత్యం స్మరించుకోవలసిన విలక్షణ నేత దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలి అణగారిన వర్గాల నేత అని ప్రశంసలు కురిపించారు. సమకాలీన కుటిల రాజనీతి కారణంగా రెండేళ్లకే సీఎం పదవి కోల్పోయారని తెలిపారు. స్వల్ప కాలంలో సాధించిన విజయాలు, అపూర్వ సేవలు చిరస్మరణీయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మాతృ భాష తెలుగుపై ఆయనకు మక్కువ ఎక్కువ అని పవన్కల్యాణ్ చెప్పారు.
Updated Date - 2021-10-17T21:55:26+05:30 IST