కేంద్రమంత్రి కిషన్రెడ్డిని అడ్డుకున్న దళిత సంఘాలు
ABN, First Publish Date - 2021-08-21T00:51:33+05:30
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జన ఆశీర్వాద యాత్ర చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కాన్వాయ్ని దళిత సంఘాల నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జన ఆశీర్వాద యాత్ర చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కాన్వాయ్ని దళిత సంఘాల నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తొర్రూరులో ప్రవేశించిన జన ఆశీర్వాద యాత్ర రోడ్షో విశ్రాంతి భవనం వద్దకు చేరుకునే సమయంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కాన్వాయ్ను అడ్డుకునే యత్నం చేశారు. ఇది గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకుని తొర్రూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని, వర్గీకరణపై కిషన్రెడ్డి వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, మంత్రి కిషన్రెడ్డి డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Updated Date - 2021-08-21T00:51:33+05:30 IST