విద్యుత్ షాక్తో మృతి
ABN, First Publish Date - 2021-06-16T04:49:15+05:30
విద్యుత్ షాక్తో మృతి
గీసుగొండ, జూన్ 15: స్నానం చేసేందుకు బాత్రూం వెళ్లి విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన మంగళవా రం ఎలుకుర్తిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం ఆటోనగర్ కేఎల్ మహీంద్రనగర్కు చెందిన పోడేటి బాబు(49) కుటుంబ సభ్యులతో కలిసి ఎలుకుర్తిలోని తన బంధువుల వివాహానికి సోమవారం వచ్చారు. మంగళవారం రిసిప్షన్ ఉండటంతో అక్కడే ఉన్నారు. ఉదయం స్నానానికి బాత్రూం కు వెళ్లిన అతను చాలా సేపటి వరకు బయటికి రాకపోవడంతో కుమారుడు రాజు వెళ్లి బాత్రూం తలుపులను బలవంతంగా తీసి చూడగా కొన ఊపిరితో కొట్టు మిట్టా డుతున్నాడు. నీటిని వేడిచేయటానికి ఉపయోగించే వాటర్హీటర్ వైర్లు బాబుకు తగిలి ఉండటంతో వాటిని తీసేసి ఎంజీఎంకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్ప టికే మృతిచెందినట్లు నిర్ధారించారు. బాబు కుమారుడు రాజు ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Updated Date - 2021-06-16T04:49:15+05:30 IST