ఉరితాళ్లుగా సాగు చట్టాలు ఆర్. నారాయణమూర్తి
ABN, First Publish Date - 2021-03-08T08:58:20+05:30
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లని, వెంటనే వాటిని రద్దు చేయాలని సినీ నటుడు, దర్శకుడు నారాయణమూర్తి డిమాండ్ చేశారు.
పెద్దపల్లి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లని, వెంటనే వాటిని రద్దు చేయాలని సినీ నటుడు, దర్శకుడు నారాయణమూర్తి డిమాండ్ చేశారు. కేంద్రం ఈ చట్టాలను రద్దు చేసే వరకు పార్టీలకతీతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని పెద్దపల్లి లో ఆదివారం న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి కమాన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంత రం నిర్వహించిన రైతు పోరుగర్జన సభలో నారాయణమూర్తి మాట్లాడారు. అంబానీలు, అదానీలు, కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం ఆ చట్టాలను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు.
Updated Date - 2021-03-08T08:58:20+05:30 IST