ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన దేశానికి ప్రమాదం: Narayana
ABN, First Publish Date - 2021-11-27T19:29:09+05:30
ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన దేశానికి ప్రమాదమన సీపీఐ నేత నారాయణ అన్నారు.
హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన దేశానికి ప్రమాదమన సీపీఐ నేత నారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన దేశాన్ని అతలాకుతలం చేస్తోందని విమర్శించారు. దేశాన్ని మోదీ అదానీలకు అప్పగించారని ఆరోపించారు. ఆర్డినెన్స్లతో మోదీ ప్రభుత్వం పార్లమెంటులో చర్చలకు అవకాశం లేకుండా చేసిందన్నారు. తన క్యాబినెట్లో అవినీతి మరకలున్న 36 మందిని ఎప్పుడు తొలగిస్తారో మోదీ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు.
Updated Date - 2021-11-27T19:29:09+05:30 IST