ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్లో పెరిగిన పత్తి ధర

ABN, First Publish Date - 2021-10-26T05:13:32+05:30

మార్కెట్లో పెరిగిన పత్తి ధర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్వింటాకు రూ.7,900 


వరంగల్‌ టౌన్‌, అక్టోబరు 25: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి ధర క్వింటాకు రూ.7,900 పలికింది. ఈ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి పత్తికి ఇంత ధర పలకడం ఇదే ప్రథమం. దీంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేశారు. పత్తి ఎగుమతులకు మంచి అవకాశం ఉండడంతోపా టు సీడ్‌ ధర, బేళ్ల ధర పెరగడంతో ముడిపత్తికి ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో పత్తి ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారవర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంట చాలా వరకు దెబ్బతింది. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి అంచనా వేయగా ప్రస్తుత అంచనా ప్రకారం ఎకరానికి ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి గగనమంటున్నారు. 

Updated Date - 2021-10-26T05:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising