నిజామాబాద్ జిల్లాలో coronaతో ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2021-10-28T12:37:35+05:30
జిల్లా కరోనాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కోటగిరి మండలానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. వారం రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉండగా
బోధన్: జిల్లా కరోనాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కోటగిరి మండలానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. వారం రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉండగా చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కరోనాతో మృతి చెందినట్లు సర్పంచ్ వివేక్ తెలిపారు. కరోనా నిబంధనలకు మేరకు అంత్యక్రియలు చేసినట్లు తెలిపారు. బోధన్ మండలానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి కరోనా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
Updated Date - 2021-10-28T12:37:35+05:30 IST