కరోనా వేళ కేపీ ఫౌండేషన్ సహకారం: ఏఐఎఫ్
ABN, First Publish Date - 2021-06-22T08:48:00+05:30
కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో అత్యవసర పరికరాలు అందించడంలో సహకరించిన కేపీ ఫౌండేషన్ ఫౌండర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్కు అమెరికన్ ఇండియా ఫౌండేషన్(ఏఐఎఫ్) కృతజ్ఞతలు తెలిపింది.
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో అత్యవసర పరికరాలు అందించడంలో సహకరించిన కేపీ ఫౌండేషన్ ఫౌండర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్కు అమెరికన్ ఇండియా ఫౌండేషన్(ఏఐఎఫ్) కృతజ్ఞతలు తెలిపింది. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు వాటికి అత్యవసర పరికరాల్ని ఏఐఎఫ్ అందించింది. ఇందుకు గాను కేపీ ఫౌండేషన్ సాయం చేసిందని ఏఐఎఫ్ తెలిపింది.
Updated Date - 2021-06-22T08:48:00+05:30 IST