ఒకే అపార్ట్మెంట్లో 10 మందికి కరోనా
ABN, First Publish Date - 2021-12-05T01:51:31+05:30
రాజేంద్రనగర్ పీరంచెరువు ప్రాంతంలో కరోనా కలకలం
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీరంచెరువు ప్రాంతంలో కరోనా కలకలం సృష్టించింది. గిరిధారి అపార్ట్మెంట్లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అపార్ట్మెంట్ వాసికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతని నుంచి అపార్ట్మెంట్ వాసులకు వైరస్ సోకింది. దీంతో ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే బండ్లగూడ మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అపార్ట్మెంట్లో శానిటేషన్ ప్రక్రియను చేపట్టారు. రేపు అపార్ట్మెంట్ వాసులకు వైద్యాధికారులు రాపిడ్ టెస్ట్ చేయనున్నారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
Updated Date - 2021-12-05T01:51:31+05:30 IST