కాంగ్రెస్ సర్పంచ్ ఇంట్లో తనిఖీలు
ABN, First Publish Date - 2021-04-11T07:55:15+05:30
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ సర్పంచ్ ఇంట్లో తనిఖీలు చేసి రూ.4.81 లక్షల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
4.81 లక్షల నగదు, మద్యం స్వాధీనం
నిడమనూరు, ఏప్రిల్ 10: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ సర్పంచ్ ఇంట్లో తనిఖీలు చేసి రూ.4.81 లక్షల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిడమనూరులో సర్పంచ్ మేరెడ్డి పుష్పలత నివాసంలో డబ్బు, మద్యం ఉందన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ శుక్రవారం రాత్రి తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా నగదుతో పాటు.. 96 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుంది. సర్పంచ్ కుమారుడు మేరెడ్డి శ్రీనివా్సరెడ్డిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ కొండల్రెడ్డి తెలిపారు. తుమ్మడం గ్రామంలోని కాంగ్రెస్ నేత యడవెల్లి రంగశాయిరెడ్డి ఇంటితో పాటు నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ కుమారుడు రవి ఇళ్లలోనూ పోలీసులు తనిఖీలు చేయగా, ఏమీ దొరకలేదు.
Updated Date - 2021-04-11T07:55:15+05:30 IST