వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN, First Publish Date - 2021-12-15T00:58:41+05:30
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ
ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు వెనకడుగు వేయలేదన్నారు. వర్గీకరణ కోసంతన జీవితాన్ని మంద కృష్ణ మాదిగ అంకితం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ గళాన్ని పార్లమెంట్ లో లెవనెత్తుతామన్నారు. వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని ఆయన అన్నారు. అందరికి న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలన్నారు. వర్గీకరణ ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. వర్గీకరణ కోసం తన వంతుగా పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Updated Date - 2021-12-15T00:58:41+05:30 IST