హుజురాబాద్కు ఈటల ఏం చేశారు?: ఉత్తమ్
ABN, First Publish Date - 2021-10-27T00:07:53+05:30
ఉప ఎన్నిక జరుగతున్న హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి
హన్మకొండ: ఉప ఎన్నిక జరుగతున్న హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈటల రాజేందర్ ఏం చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. ఎవరెక్కువ దోచుకున్నారనే విషయంలోనే కేసీఆర్, ఈటల మధ్య పంచాయితీ వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని ఉత్తమ్ ఆరోపించారు. గతంలో ప్రజలకు కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రంలో దోపిడీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని ఉత్తమ్ పేర్కొన్నారు.
Updated Date - 2021-10-27T00:07:53+05:30 IST