బదిలీలు హేతుబద్దంగా జరగడం లేదు: రాంచంద్రా రెడ్డి
ABN, First Publish Date - 2021-12-23T21:31:51+05:30
రాష్ట్రంలో టీచర్ల బదిలీలు హేతుబద్దంగా జరగడం లేదని
హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ల బదిలీలు హేతుబద్దంగా జరగడం లేదని పీసీసీ అధికార ప్రతినిధి రాంచంద్రా రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో కీలకంగా పనిచేసిన టీచర్లను బదిలీల పేరుతో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆయన ఆరోపించారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో చాలా మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులపై సానుకూలంగా ఆలోచించాలని ఆయన కోరారు.
Updated Date - 2021-12-23T21:31:51+05:30 IST