ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ నేపథ్యంలో కరపత్రాల కలకలం

ABN, First Publish Date - 2021-06-21T17:31:29+05:30

జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో కలకలం రేగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కరపత్రాలు హాట్ టాపిక్‌గా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ అర్బన్: జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో కలకలం రేగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కరపత్రాలు హాట్ టాపిక్‌గా మారాయి. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జాలకు పాల్పడ్డారంటూ పేరు తెలియని వ్యక్తులు కరపత్రాలు పంపిణీ చేశారు. న్యూస్ పేపర్‌లో పెట్టి వరంగల్ తూర్పులో పంపిణీ చేశారు. నేడు సీఎం కేసీఆర్ వరంగల్ టూర్‌ను దృష్టిలో పెట్టుకుని, ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు పంచినట్టుగా చర్చ జరుగుతోంది. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బీ ఫారమ్స్ 50 లక్షలకు అమ్ముకున్నాడని, గతంలో ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోను ఇలాగే డబ్బులు వసూలు చేశారని కరపత్రాల్లో పేర్కొన్నారు. వరంగల్ తూర్పులో భూకబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్ మెంట్ అంటూ ఘాటుగా ఆరోపణలు చేశారు. 

Updated Date - 2021-06-21T17:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising