ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2021-09-09T20:16:30+05:30
సీఎం కేసీఆర్ 9 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కేసీఆర్ బయల్దేరారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ 9 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కేసీఆర్ బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిశారు. ఈ నెల 2న ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. 3న ప్రధాని నరేంద్రమోదీని, 4న హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. 5న మాత్రం ఎవరినీ కలుసుకోలేదు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలుసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన అపాయింట్మెంట్ లభించలేదు. ఇక ఈ నెల 6న కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి ని, జలశక్తి మంత్రిని కలుసుకున్నారు. 7న తెలంగాణ లోవరదల పరిస్థితి గురించి అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించారు.
Updated Date - 2021-09-09T20:16:30+05:30 IST