మంత్రి ఈటల శాఖ సీఎం కేసీఆర్కు బదిలీ
ABN, First Publish Date - 2021-05-01T20:01:22+05:30
రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ
హైదరాబాద్: రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్ శాఖలేని మంత్రిగా మారారు. ఇదిలా ఉండగా మంత్రి ఈటల పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు దాదాపుగా నిజమేనని విజిలెన్స్, రెవెన్యూఅధికారులు తేల్చారు. కాసేపట్లో సీఎస్, ఏసీబీ డీజీ సంబంధిత నివేదికను సీఎం కేసీఆర్కు అందేయనున్నారు. ఈ పరిణామంతో ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయమని కోరే అవకాశం వుంది.
నా శాఖను బదిలీ చేశారు.. సంతోషం : మంత్రి ఈటల
Updated Date - 2021-05-01T20:01:22+05:30 IST