సీఎంతో సీఎల్పీ భేటీపై టీ కాంగ్రెస్లో ముసలం
ABN, First Publish Date - 2021-06-27T00:00:52+05:30
సీఎం కేసీఆర్తో సీఎల్పీ బృందం భేటీ కావడంపై తెలంగాణ కాంగ్రెస్లో ముసలం
హైదరాబాద్: సీఎం కేసీఆర్తో సీఎల్పీ బృందం భేటీ కావడంపై తెలంగాణ కాంగ్రెస్లో ముసలం పుట్టింది. సీఎంను సీఎల్పీ బృందం కలవడంపై టి.కాంగ్రెస్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ను భట్టి బృందం కలువడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ విభేదించారు. సోషల్ మీడియాలో ట్రోల్తో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. ఎస్పీ సెల్ జాతీయ చైర్మన్ నితిన్ రావత్ ఎదుట నేతల మధ్య సీఎంతో భేటీ ప్రస్తావన వచ్చింది. రావత్ వెళ్లగానే ఉత్తమ్తో భట్టి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఉత్తమ్ అభిప్రాయంతో ఎమ్మెల్యేలు విభేదించారు. ప్రజా సమస్యలపై సీఎంను కలిస్తే తప్పేంటని భట్టి ప్రశ్నించారు.
Updated Date - 2021-06-27T00:00:52+05:30 IST