ఎంపీ బండా ప్రకాశ్పై చీటింగ్ కేసు
ABN, First Publish Date - 2021-07-25T08:01:24+05:30
రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మరో ఇద్దరిపై హన్మకొండ సుబేదారి పోలీ్సస్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ కథనం ప్రకారం.. హంటర్రోడ్ న్యూశాయంపేటలోని...
హన్మకొండ రూరల్, జూలై 24: రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మరో ఇద్దరిపై హన్మకొండ సుబేదారి పోలీ్సస్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ కథనం ప్రకారం.. హంటర్రోడ్ న్యూశాయంపేటలోని అల్లూరి ట్రస్ట్, అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కు ఎంపీ బండా ప్రకాశ్ కార్యదర్శిగా ఉన్నారు. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో దాఖలు చేసిన ఆదాయపన్ను విషయంలో.. ఎంపీతోపాటు.. చార్టెడ్ అకౌంటెంట్లు అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి వంశీధర్ రూ. 12,21,912ల మేర నిధులను దుర్వినియోగం చేసినట్లు మల్లారెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీ బండాప్రకాశ్, అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి వంశీధర్పై ఐపీసీలోని సెక్షన్లు 409, 417, 120బీ, సీఆర్పీసీలోని సెక్షన్ 156(3) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు.
Updated Date - 2021-07-25T08:01:24+05:30 IST