ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం పాలసీ ఏంటి..? రైతులను బతకనిస్తారా.. లేదా..?: కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-11-18T20:40:59+05:30

కేంద్రం పాలసీ ఏంటి..? రైతులను బతకనిస్తారా.. లేదా..? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. గురువారం ఇందిరాపార్క్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రం పాలసీ ఏంటి..? రైతులను బతకనిస్తారా.. లేదా..? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో  కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పండించే వడ్లు కొంటరా.. లేదా..? అని ప్రశ్నించారు. ఈ గోస తెలంగాణలోనే కాదని, దేశమంతా ఉందని చెప్పారు. పంటలు కొనేందుకు కేంద్రానికి భయమన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని హెచ్చరించారు. తెలంగాణ రైతాంగ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. హంగర్‌ ఇండెక్స్‌లో దేశం 101 స్థానంలో ఉందని తెలిపారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కన్నా దీన స్థితిలో భారత దేశం ఉందని కేసీఆర్ చెప్పారు. 


‘‘కేంద్రం కళ్లు తెలిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టాం. దేశాన్ని పాలిస్తున్న నేతలు వితండవాదాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న వారు ధర్నా ఎలా చేస్తారని అంటున్నారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ధర్నా చేయలేదా? సీఎంలు ధర్నాలు చేయకుండా పాలించే బాధ్యత కేంద్రానిదే. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదు’’ కేసీఆర్‌ పేర్కొన్నారు.


Updated Date - 2021-11-18T20:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising