కంటతడి పెట్టిన కిషన్రెడ్డి
ABN, First Publish Date - 2021-08-21T21:20:56+05:30
అంబర్పేట: జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా శనివారం అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి అయినా తనకు సంతోషం లేదని..
అంబర్పేట: జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా శనివారం అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అయినా తనకు సంతోషం లేదని.. అంబర్ పేటకు దూరమయ్యాననే బాధే ఎక్కువ ఉందని చెబుతూ కంటతడి పెట్టారు. అంబర్పేటకు వస్తుంటే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలే తన ప్రాణమని.. అంబర్పేట బిడ్డగా అంతా గర్వపడేలా పని చేస్తానన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే అందుకు.. అంబర్ పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే కారణమని చెప్పారు. దేశానికి రాజైనా అంబర్పేటకు తాను బిడ్డనే అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-08-21T21:20:56+05:30 IST