కరాటే కల్యాణిపై కేసు నమోదు
ABN, First Publish Date - 2021-12-25T21:32:15+05:30
నగరంలోని జగద్గిరిగుట్ట పీఎస్లో సినిమా నటి కరాటే
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పీఎస్లో సినిమా నటి కరాటే కల్యాణిపై కేసు నమోదయింది. గతంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ బాలికపై జరిగిన హత్యాచార వివరాలను కల్యాణి వెల్లడించారు. దీంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో జగద్గిరిగుట్ట వాసి నితేష్ పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్ట పీఎస్లో కేసు నమోదయింది.
సింగరేణి కాలనీలో బాలికపై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరకు నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చట్టప్రకారం అత్యాచార బాధితుల వివరాలను బయట పెట్టడానికి వీలు లేదు. కానీ బాధితురాలి వివరాలను కరాటే కల్యాణి బయటపెట్టారు. దీంతో ఆమెపై కేసు నమోదయినట్లు తెలుస్తోంది.
Updated Date - 2021-12-25T21:32:15+05:30 IST