బీజేపీ కార్యకర్తలపై కేసు
ABN, First Publish Date - 2021-08-24T01:28:16+05:30
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్లో స్పెషల్ బ్రాంచి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎనిమిది మంది
వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్లో స్పెషల్ బ్రాంచి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.. వల్భాపూర్లో సోమవారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్పెషల్ బ్రాంచికి చెందిన ఏఎస్ఐ బాపురెడ్డి ఫోటోలు, వీడియోలు తీస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య తోపులాట జరిగింది. స్పెషల్ బ్రాంచీ ఏఎస్ఐ బాపురెడ్డిని వల్భాపూర్కు చెందిన బీజేపీ కార్యకర్తలు జీడీ రాజు, దొమ్మటి రాజమల్లు, నలబాల మధు, మారముల్ల సదయ్య, విజేందర్, శివయ్య, జీడీ మోహన్, దొమ్మటి శ్రీనివాస్ కొట్టారు. ఆయన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఏఎస్ఐ బాపురెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-08-24T01:28:16+05:30 IST