ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దార్‌ను దూషించిన కానిస్టేబుల్‌పై కేసు

ABN, First Publish Date - 2021-02-25T05:17:48+05:30

తహసీల్దార్‌ను దూషించిన కానిస్టేబుల్‌పై కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ టౌన్‌, ఫిబ్రవరి 24 : భీమదేవరపల్లి తహసీల్దార్‌ పి.ఉమారాణిని దూషించిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సురేందర్‌పై కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ జనార్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్‌ భార్య వీఆర్‌వో నుంచి ఆర్‌ఐగా పదోన్నతి పొందినప్పటికీ స్వచ్ఛందంగా వీఆర్‌వోగానే కొనసాగుతోంది. ఇటీవల ఆర్‌ఐలంతా ఎమ్మార్వోలుగా పదోన్నతి పొందిన క్రమంలో తన భార్య వీఆర్‌వోగా కొనసాగడానికి భీమదేవరపల్లి తహసీల్దార్‌ ఉమారాణి కారణమని ఆరోపిస్తూ మద్యం సేవించి దూషించాడు. వినాయకనగర్‌లోని తహసీల్దార్‌ ఇంటికి వెళ్లి దుర్బాషలాడాడు. విధులకు వెళ్లకుండా ఆటంకం కలిగించి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వారించినా వినకపోవడంతో తహసీల్దార్‌  కేయూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్‌ సురేందర్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ జనార్దన్‌రెడ్డి తెలిపారు. 



Updated Date - 2021-02-25T05:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising