ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాధలకు ప్రభుత్వమే తల్లీతండ్రిగా కొత్త చట్టం అమలుకు నిర్ణయం

ABN, First Publish Date - 2021-08-08T20:28:04+05:30

తెలంగాణ రాష్ట్రంలో అనాధలు, అనాధాశ్రమాలు, కోవిడ్ వల్ల అనాధలయిన వారి స్థితిగతులు ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అనాధలు, అనాధాశ్రమాలు, కోవిడ్ వల్ల అనాధలయిన వారి స్థితిగతులు ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సీఎం కేసిఆర్, గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ఏర్పాటయిన  క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వమే తల్లిదండ్రిగా మారి అనాధల సంరక్షణ, సంక్షేమం, భవిష్యత్ బాధ్యతలు తీసుకోవాలని అభిప్రాయపడింది.  దేశంలోనే అత్యుత్తమమైన, ఆదర్శవంతమైన విధానాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందించాలని పేర్కొంది.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కేబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. దీనికి మంత్రులు కేటీఆర్, ఇంద్ర కరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్,సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అనాధల సంక్షేమాన్ని మానవీయ కోణంలో ప్రభుత్వం చూస్తుందని, ఎంత ఖర్చు అయినా భరిస్తుందని, ఈ సబ్ కమిటీ ద్వారా ప్రతిపాదించే పాలసీ దేశం మొత్తం గర్వించే విధంగా, ఇతర రాష్రాలన్నీ అనుసరించే విధంగా సూచిస్తామని కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.


తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతంగా ఉందని, ఈ అనాధల కోసం అమలు చేసే విధానం వీటన్నింటిని మించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనాధగా ఈ ప్రభుత్వ సంరక్షణలోకి వచ్చిన పిల్లలు ఎదిగి, స్థిరపడి తల్లిదండ్రులుగా మారే వరకు, కుటుంబంగా తయారు అయ్యే వరకు ప్రభుత్వమే వారికి తల్లిదండ్రులుగా అన్నిరకాల బాధ్యతలు తీసుకునే విధంగా కొత్త విధానం తీసుకు వచ్చేందుకు ప్రతిపాదిస్తామని చెప్పారు. ఇందుకోసం న్యాయపర ఇబ్బందులు లేకుండా చూసి పకడ్భందీగా ఈ విధానాన్ని రూపొందించేలా ప్రతిపాదనలు చేస్తామన్నారు.పాత చట్టాలకు మార్పులు చేయడం, పాత విధానాన్ని సవరించడం కాకుండా సంపూర్ణంగా, సమగ్రంగా కొత్త విధానం , కొత్త చట్టం ఉండే విధంగా ఈ సబ్ కమిటీ కసరత్తు చేసి ప్రతిపాదనలు చేస్తుందన్నారు. 


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వివిధ వర్గాలకు అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే గొప్పగా, మరింత ఎక్కువగా అనాధల సంరక్షణ కోసం అమలయ్యే విధంగా రానున్న నూతన విధానాన్ని సూచిస్తామన్నారు.ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్ లు, హోమ్స్, ఆశ్రమాలను పటిష్టంగా తయారుచేస్తూ, ప్రైవేట్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో గొప్పగా నిర్వహిస్తున్న అనాధ ఆశ్రమాలను ప్రోత్సహించే విధంగా ఈ కమిటీ తన సూచనలు సమర్పిస్తుందన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సభ్యులు పరిశీలించి అభిప్రాయాలు క్రోడీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. 

Updated Date - 2021-08-08T20:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising