ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో పడి బాలుడి మృతి

ABN, First Publish Date - 2021-05-07T06:48:57+05:30

బావిలో పడి బాలుడి మృతి

రాజన్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి, బంధువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌ టౌన్‌, మే 6 : మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు మంద కొమురమ్మనగర్‌లో గురువారం మూడెళ్ల బాలుడు పిట్టల రాజన్‌ బావిలో పడి మృతి చెందాడు. కాలనీవాసుల వివరాల మేరకు.. మంద కొమురమ్మనగర్‌కు చెందిన పిట్టల సంపత్‌-సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు గురువారం ఇంటిని శుభ్రం చేస్తుండగా బాలుడు రాజన్‌ ఆడుకుంటూ వెళ్లి ఇంటి సమీపంలోని బావిలో పడిపోయాడు. పని ముగిసిన అనంతరం తల్లిదండ్రులు బాలుడి కోసం చుట్టుపక్కల వెతకగా బావిలో శవమై కన్పించాడు. స్థానికుల సాయంతో రాజన్‌ మృతదేహాన్ని వెలికి తీశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి గుగ్గిళ్ల పీరయ్య, మీసాల సురేష్‌, కాలనీ వాసులు పాష, భిక్షపతిలు ఆ కుటుంబసభ్యులను పరామర్శించారు. 

Updated Date - 2021-05-07T06:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising