పటిక, బెల్లం పట్టివేత
ABN, First Publish Date - 2021-01-18T05:10:29+05:30
పటిక, బెల్లం పట్టివేత
బయ్యారం, జనవరి 17 : మడలంలోని గురిమెళ్ల కంబాల పల్లి సరిహద్దు అటవీ ప్రాంతంలో అక్రమంగా నిల్వచేసిన రూ. 3.5 లక్షలు నల్లబెల్లం, పట్టికను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు బయ్యారం ఎస్సై జగదీష్ పేర్కొన్నారు. కంబాల పల్లికి చెందిన వీరేందర్, నరసయ్య అడవిలో బెల్లం, పట్టిక దాచిపెట్టినట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి 35 క్వింటాళ్ల బెల్లం, క్వింటా పటికను స్వాధీనం చేసుకున్నామన్నా రు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Updated Date - 2021-01-18T05:10:29+05:30 IST