కామారెడ్డి జిల్లాలో ఒకరికి బ్లాక్ ఫంగస్!
ABN, First Publish Date - 2021-05-15T08:09:07+05:30
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగేడిగిలో బీబీ దేవిదాస్(46) అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకింది.
బీర్కూర్, మే 14: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగేడిగిలో బీబీ దేవిదాస్(46) అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. దేవిదాస్కు ఇటీవల కరోనా పాజిటివ్ రాగా హోం ఐసోలేషన్లో ఉండి వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకున్నాడు. అనంతరం ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్గా నిర్ధారణ అయింది. అయితే.. నాలుగు రోజుల నుంచి అతడి పళ్లు ఊడిపోతుండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బ్లాక్ ఫంగస్గా నిర్ధారించి, చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు.
Updated Date - 2021-05-15T08:09:07+05:30 IST