ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ABN, First Publish Date - 2021-11-26T01:12:14+05:30

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దోబూచులాడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దోబూచులాడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగల్లాత యారయ్యాయని, వాటికి రైతుల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. జనగామ జిల్లా కేంద్రంలో బీఎస్పీ జిల్లా కార్యాలయాన్ని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 రోజులుగా కల్లాల్లో ధాన్యాన్ని పోసుకొని రైతులు కొనుగోళ్లకు ఎదురుచూస్తున్నారని, అయినప్పటికీ కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. లాభాల మాట పక్కనపెడితే రైతులకు ధాన్యాన్ని కాపాడుకోవడానికే రూ. 10 నుంచి రూ.15 వేల ఖర్చు వస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం మిల్లర్లతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని, అందువల్లే ధాన్యం కొనుగోళ్లపై కుంటిసాకులు చెబుతుందని ఆరోపించారు. మిల్లర్లు రైతులను దోచుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొన్నాకొనకున్నా తెలంగాణ ప్రభుత్వం కొనితీరాల్సిందేనని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-11-26T01:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising