తాగు.. ఊగు...దండుకో... బండి సంజయ్
ABN, First Publish Date - 2021-12-11T21:15:13+05:30
రాష్ట ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
హైదరాబాద్: రాష్ట ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాగు.. ఊగు...దండుకో.. దంచుకో... అనే విధంగా మద్యాన్ని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. వర్షకాలం పంట కొనబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడ చెప్పలేదన్నారు. వానాకాలం పంట కొంటామని నామా నాగేశ్వర్ ముందే గోయల్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. వానాకాలం పంటను కేసీఆర్ ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్కు కన్పించడం లేదా అని నిలదీశారు. ప్రత్యామ్నాయ పంటల గురించి కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. కేసీఆర్, మంత్రులు తమ బాషను మార్చుకోవాలని ఆయన సూచించారు.
Updated Date - 2021-12-11T21:15:13+05:30 IST