ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులకు మూడెకరాల భూమి మాదిరే ...: రఘునందన్‌రావు

ABN, First Publish Date - 2021-10-20T02:38:57+05:30

దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. దళితబంధుపై హుజురాబాద్‌లో కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. దళితబంధుపై హుజురాబాద్‌లో కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. దళితులకు మూడెకరాల భూమి మాదిరే ... దళితబంధు పథకం కూడా అని విమర్శించారు. తమకు పది లక్షలు ఇచ్చే ఆలోచన కేసీఆర్‌కు లేదని ప్రజలే అనుకుంటున్నారని చెప్పారు. దళితబంధును ఆపాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మానాభరెడ్డి ఈసీకి ఆగస్టులోనే లేఖ రాశారని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుండా ఎందుకు ఫ్రీజ్ చేశారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలటంతోనే కేటీఆర్ ప్రచారానికి రావటం లేదన్నారు. ఈటల కాదు.. హరీష్‌రావే కాంగ్రెస్‌లోకి వస్తున్నారని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవుతోందనే రేవంత్‌ ప్రచారానికి రావడం లేదన్నారు. 

Updated Date - 2021-10-20T02:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising