టీఆర్ఎస్ రాజకీయ చావు దగ్గరలోనే ఉంది: అర్వింద్
ABN, First Publish Date - 2021-11-16T04:00:18+05:30
బండి సంజయ్పై టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నామని ఎంపీ అర్వింద్ తెలిపారు. బీజేపీ తలుచుకుంటే టీఆర్ఎస్ నేతలు బయట తిరగలేరని...
హైదరాబాద్: బండి సంజయ్పై టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నామని ఎంపీ అర్వింద్ తెలిపారు. బీజేపీ తలుచుకుంటే టీఆర్ఎస్ నేతలు బయట తిరగలేరని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ దాడులపై ఎక్కడ ఎవరితో చర్చించాలో తమకు తెలుసన్నారు. టీఆర్ఎస్ రాజకీయ చావు దగ్గరలోనే ఉందని చెప్పారు. దమ్ముంటే బీజేపీతో రాజకీయంగా పోరాటం చేయాలని అర్వింద్ సవాల్ విసిరారు.
Updated Date - 2021-11-16T04:00:18+05:30 IST