మంత్రి కమలాకర్లా మేము మాట్లాడలేం: ఎమ్మెల్యే రఘునందన్రావు
ABN, First Publish Date - 2021-06-18T00:52:48+05:30
మంత్రి గంగుల కమలాకర్లా తాము మాట్లాడలేమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు
కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్లా తాము మాట్లాడలేమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్కు రాత్రికి రాత్రే నిధుల జీవోలు ఇస్తున్నారని రఘునందన్రావు ఆరోపించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీలో ప్రతిపక్షానికి రూం ఇస్తామని స్పీకర్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తరపున అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నామని, త్వరలో ముగ్గురు, ఆ తర్వాత ఐదుగురం అవుతామని ఎమ్మెల్యే రఘునందన్రావు పేర్కొన్నారు.
Updated Date - 2021-06-18T00:52:48+05:30 IST