బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశ నిర్ణయాలు
ABN, First Publish Date - 2021-07-24T23:13:04+05:30
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశ నిర్ణయాలు
ఢిల్లీ: నగరంలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశ నిర్ణయాలను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీసీల కోసం బీజేపీ చేస్తున్న పనులను ప్రజలకు వివరించాలని ఓబీసీ మోర్చా నిర్ణయించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి బీజేపీ వల్ల బీసీలకు జరుగుతున్న న్యాయాన్ని వివరిస్తామన్నారు. ప్రతి రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ హక్కుల కాపాడేందుకు బీసీల మద్దతు కూడగట్టి బీజేపీ పోరాడుతుందన్నారు.
Updated Date - 2021-07-24T23:13:04+05:30 IST