బీజేపీ.. బిగ్ జోకర్స్ పార్టీగా మారింది: జీవన్రెడ్డి
ABN, First Publish Date - 2021-08-22T21:22:46+05:30
బీజేపీ.. బిగ్ జోకర్స్ పార్టీగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఎద్దేవాచేశారు. పసుపు బోర్డు తెస్తానని ఫేక్ బాండ్ రాసిచ్చిన ఫేక్ ఎంపీ అర్వింద్ అని దుయ్యబట్టారు.
హైదరాబాద్: బీజేపీ.. బిగ్ జోకర్స్ పార్టీగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఎద్దేవాచేశారు. పసుపు బోర్డు తెస్తానని ఫేక్ బాండ్ రాసిచ్చిన ఫేక్ ఎంపీ అర్వింద్ అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావుల గురించే మాట్లాడేస్థాయి అర్వింద్కు లేదని హెచ్చరించారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలున్న అర్వింద్ ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తాడా? అని ప్రశ్నించారు. అవినీతి గురించి అర్వింద్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, 28 మంది అవినీతిపరులను దేశం దాటించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. జైలుకెళ్లిన కాంగ్రెస్ నేత రేవంత్ కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నియంత, కుటుంబ పాలన అనడం తప్ప కాంగ్రెస్, బీజేపీలకు ఏదీ చేత కాదని తప్పుబట్టారు. అర్వింద్కు దమ్ముంటే మోదీతో మాట్లాడి పసుపు బోర్డు తెప్పించాలన్నారు. బీజేపీ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరని జీవన్రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-08-22T21:22:46+05:30 IST