నిజామాబాద్: 200 కోళ్ల మృతి.. బర్డ్ఫ్లూగా అనుమానం
ABN, First Publish Date - 2021-01-13T18:58:20+05:30
నిజామాబాద్: డిచ్ పల్లి మండలం యానంపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. యానం పల్లి తండా సమీపంలోని
నిజామాబాద్: డిచ్ పల్లి మండలం యానంపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. యానం పల్లి తండా సమీపంలోని ఓ పౌల్ట్రీ ఫారంలో 200 కోళ్ళ మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు మృతి చెందాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు విషయాన్ని పశు సంవర్ధక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మృతి చెందిన కోళ్లను పౌల్ట్రీ నిర్వాహకులు గుంత తీసి పూడ్చి పెట్టారు.
Updated Date - 2021-01-13T18:58:20+05:30 IST