10:30కు భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవం ప్రారంభం
ABN, First Publish Date - 2021-04-21T13:01:28+05:30
భద్రాద్రి: నేడు భద్రాద్రిలో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణఘట్టం ప్రారంభం కానుంది.
భద్రాద్రి: నేడు భద్రాద్రిలో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణఘట్టం ప్రారంభం కానుంది. కరోనా నిబంధనల దృష్ట్యా భక్తులకు అనుమతిని నిరాకరించారు. మంత్రులు అల్లోల, పువ్వాడ అజయ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం జరగనుంది. కోవిడ్ కారణంగా ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు నిలిపివేశారు.
Updated Date - 2021-04-21T13:01:28+05:30 IST