Bhadradri Kottagudem: భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద
ABN, First Publish Date - 2021-07-23T13:56:00+05:30
ఎగువన కురుస్తున్న వర్షాలకు, రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో భద్రాచలం వద్ద క్రమంగా క్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది
భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న వర్షాలకు, రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో భద్రాచలం వద్ద క్రమంగా క్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి వరద ప్రవాహం ప్రస్తుతం 20 అడుగులకు చేరింది. నది ఒడ్డున స్నానఘట్టాల వరకు వరద నీరు వచ్చి చేరింది. పర్ణశాల వద్ద సీతవాగు పొంగుతుంది. సీతారాముల నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. స్వామివారి సింహాసనం, సీతమ్మవారి విగ్రహం పూర్తిగా నీట మునిగింది. వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.
Updated Date - 2021-07-23T13:56:00+05:30 IST