భద్రాచలం దేవస్థానంలో లడ్డూలు మాయం
ABN, First Publish Date - 2021-09-07T23:35:30+05:30
రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో
భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వెయ్యి లడ్డూలు మాయం అయ్యాయి. ఆలయ సూపరింటెండెంట్ విచారణలో లడ్డూల గోల్మాల్ బయటపడింది. లడ్డూ కౌంటర్లో అమ్మిన లడ్డూలు, వచ్చిన ఆదాయం లెక్క తేలకపోవడంతో సూపరింటెండెంట్ విచారణ జరిపారు. లడ్డూల మాయం ఘటనలో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులకు ఆలయ ఈఓ శివాజీ మెమోలు జారీ చేసారు. వారి నుంచి లడ్డూల రేటు ప్రకారం రూ.20 వేలను ఈఓ రికవరీ చేసారు.
Updated Date - 2021-09-07T23:35:30+05:30 IST